బిజినెస్

పిడిఎస్, ఎరువుల డిపోల్లో పిఒఎస్ మెషీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: నగదు రహిత లావాదేవీలకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తూ ఆధార్ ఆధారిత లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పిఒఎస్ మెషీన్లపై చెల్లింపులను దేశంలోని అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ల్లో అనుమతించాలని కేంద్రం భావిస్తోంది. ఎరువుల డిపోల్లోనూ ఈ తరహా లావాదేవీలు జరపాలని యోచిస్తోంది. ఆర్థిక కార్యదర్శి అశోక్ లావస పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తెలిపారు. ఇప్పటికే పిడిఎస్ (చౌక ధరల దుకాణం) షాపుల్లో 1.7 లక్షలకుపైగా పిఒఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.