బిజినెస్

జిడిపి గణాంకాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: స్థూల ఆర్థిక గణాంకాలు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తీరు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నడిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఇతర ప్రభావిత అంశాలేవీ లేకపోవడంతో యుపి అసెంబ్లీ ఎన్నికలు మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడు తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆర్థిక ఫలితాల ప్రకటనలు ముగియడంతో మదుపరులు తమ పెట్టుబడులపై జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. కానీ అలాంటివేమీ ఇప్పటికైతే స్పష్టంగా లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సరళే మార్కెట్ కదలికలను పెద్దగా ప్రభావితం చేయవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా చెబుతున్నారు. ముంబయ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి దక్కిన ఘన విజయం నేపథ్యంలో యుపిలో కూడా బిజెపికి స్పష్టమైన మెజారిటీ వస్తే మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టగలవన్న అభిప్రాయా న్ని కొటక్ సెక్యూరిటీస్ పిసిజి రిసెర్చ్ సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా వ్యక్తం చేస్తున్నారు. అయతే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి జిడిపి గణాంకాలు మంగళవారం వెలువడుతుండటంతో మదుపరులు వాటి ప్రకారం పెట్టుబడులకు వెళ్లవచ్చన్నారు. సేవా, తయారీ రంగాలకు సంబంధించి విడుదలయ్యే పిఎ మ్‌ఐ గణాంకాలూ మదుపరులను ప్రభావితం చేయను న్నాయ. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసు కున్న పరిణామాల నుంచి మార్కెట్ కోలుకుంటుండటంతో ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరు లను ఆకర్షించవచ్చని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. పాత పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన కరెన్సీ కొరత, ముఖ్యంగా చిల్లర సమస్య కారణంగా వ్యాపారాలు డీలా పడిపోయ నది తెలిసిందే. అయతే ప్రస్తుతం డిమానిటైజేషన్ నుంచి మార్కెట్ బయటపడటం, రీమానిటైజేషన్ కొనసాగుతోం దని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయ. ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం. కాగా, ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 424.22 పాయింట్ల్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 117.80 పాయింట్లు కోలుకుంది. ఫలితంగా వరుసగా నాలుగు వారాలు లాభాల్లో నడిచినట్లైంది.