బిజినెస్

రేపటి నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ కొత్త సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మార్చి 30: ఎయిర్ ఇండియా సంస్థ రేణిగుంట నుంచి ఏప్రిల్ 1వ తేది నుంచి కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా రేణిగుంట వరకు విమానాలు నడుపుతున్న విషయం విదితమే. అయితే కొత్తగా విశాఖపట్నం, విజయవాడ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాదు మీదుగా రేణిగుంట వస్తున్నారు. దీనికి తోడు శ్రీవారి భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరిన విమాన సర్వీసు విజయవాడ మీదుగా ఉదయం 9.45 గంటలకు ఇక్కడకు చేరుకుంటుంది. తిరిగి రేణిగుంట నుంచి విజయవాడ మీదుగా విశాఖకు 78మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు సర్వీసులను ప్రారంభించనుంది. విశాఖ, విజయవాడల నుంచి బస్సులు, రైళ్ళ ద్వారా ప్రయాణికులు తిరుపతికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త విమాన సర్వీస్లు నడపడం వల్ల శ్రీవారి భక్తులు త్వరగా తిరుపతికి చేరుకునే అవకాశం కలగనుంది.