బిజినెస్
తూ.గో.లో మద్యం టెండర్ల ఆదాయం రూ. 39.66 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 1 April 2017
కాకినాడ, మార్చి 31: తూర్పు గోదావరి జిల్లాలో మద్యం టెండర్ల ద్వారా ఎక్సైజ్ శాఖకు 39 కోట్ల 66 లక్షల రూపాయల ఆదాయం లభించింది. 2017-19 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 545 మద్యం దుకాణాలకు 6,549 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ పద్ధతిలో వ్యాపారులకు దుకాణాలు కేటాయించారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరం జి కనె్వన్షన్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. ఈసారి మద్యం దుకాణాలకు పురుషులే కాకుండా మహిళలు సైతం అధికంగా టెండర్లను దాఖలు చేశారు.