బిజినెస్
హెచ్ఎమ్టి సిఎండిగా గిరీశ్ కుమార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 April 2017
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థ హెచ్ఎమ్టి లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా ఎస్ గిరీశ్ కుమార్ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఐదేళ్లకుగాను ఈ నియామకం జరగగా, శుక్రవారం ఈయన బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎమ్టి లిమిటెడ్కు ఐదు అనుబంధ సంస్థలుండగా, అందులో హెచ్ఎమ్టి మెషీన్ టూల్స్ లిమిటెడ్, హెచ్ఎమ్టి వాచెస్ లిమిటెడ్, హెచ్ఎమ్టి చినార్ వాచెస్ లిమిటెడ్, హెచ్ఎమ్టి బేరింగ్స్ లిమిటెడ్, హెచ్ఎమ్టి (ఇంటర్నేషనల్) లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి.