బిజినెస్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నూతనంగా నిర్మించిన 120 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇంధన ఉత్పత్తిలో విశాఖ ఉక్కు సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం ఆయన ప్లాంట్‌ను సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. వాటిపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆయన వెంట అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు సరస్వతి ప్రసాద్, ఉక్కు శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, హర్యానా అసెంబ్లీ సభ్యురాలు ప్రేమలత సింగ్, స్టీల్ ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి మధుసూదన్, డైరెక్టర్లు పి మహాపాత్రో (ప్రాజెక్ట్సు), డిఎన్ రావు (ఆపరేషన్స్), కెసి దాస్ (పర్సనల్) తదితరులున్నారు.

చిత్రం..ప్లాంట్ ప్రారంభోత్సవంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్