బిజినెస్

మాల్యా చెక్‌బౌన్స్ కేసు 25కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాపై దాఖలైన చెక్ బౌన్స్ కేసులో విచారణను సోమవారం హైదరాబాద్ సిటీ 3వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో వారెంట్ జారీ చేసినా కోర్టు విచారణకు మాల్యా హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత ఈ కేసులో ఈ నెల 5న కోర్టుకు విజయ్ మాల్యా హాజరు కావాల్సి ఉండగా, హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేసిన కోర్టు.. విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం కూడా మాల్యా కోర్టుకు హాజరు కాకపోవడంతో మరో అవకాశం ఇస్తూ 25వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కోర్టుకు గైర్హాజరవుతూ, న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్న విజయ్ మాల్యాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వెల్లడించారు.