బిజినెస్

యథాతథంగా ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 27: బుధవారం ముగింపుతో చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం యథాతథంగానే ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ స్వల్పంగా 0.84 పాయింట్లు పెరిగి 32,383.30 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 0.10 పాయింట్లు పడిపోయి 10,020.55 వద్ద నిలిచింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 32,672.66 పాయింట్లను తాకగా, నిఫ్టీ 10,114.85 పాయింట్ల స్థాయిని అందుకుంది. ఫలితంగా సరికొత్త ఆల్‌టైమ్ ఇంట్రా-డే హైని సూచీలు అందుకున్నట్లైంది. కాగా, త్రైమాసిక లాభాల కారణంగా హెచ్‌డిఎఫ్‌సి షేర్ల విలువ దాదాపు 6 శాతం పెరిగింది.