బిజినెస్

రుణ మార్కెట్లపై ఎఫ్‌పిఐల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ రుణ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. ఈ నెలలో ఇప్పటిదాకా 10,419 (1.6 బిలియన్ డాలర్లు) కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్ల నుంచి 2,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు వెనక్కిపోయాయ. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించిన నేపథ్యంలో రుణ మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పిఐలు ఆసక్తి కనబరిచారు. ఈ నెల 2న జరిపిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయంట్ల మేర ఆర్‌బిఐ తగ్గించినది తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ప్రథమార్ధంలో ఏకంగా 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. నిరుడు జనవరి-జూన్ మధ్య కేవలం 1.2 బిలియన్ డాలర్ల (7,600 కోట్ల రూపాయలు) పెట్టుబడులే వచ్చాయ.
కాగా, ఈ సంవత్సరం జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. ఫిబ్రవరి-జూలై మధ్య దేశీయ రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.16 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. జనవరిలో 2,300 కోట్ల రూపాయల పెట్టుబడుల ఉపసంహరణ జరగగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా దేశీయ రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.24 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 2019లో ఎన్నికలు రానున్నది తెలిసిందే. దీంతో ఈ రెండేళ్లలో మోదీ సర్కారు మరిన్ని సంస్కరణలు తెస్తుందన్న విశ్వాసంతోనే విదేశీ మదుపరులు పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. అయతే స్టాక్ మార్కెట్లు వరుస లాభాల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయలకు చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులూ విదేశీ మదుపరులను పెట్టుబడులకు దూరం చేస్తున్నాయ. దీంతో స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయ. అయతే పాత పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ బాగు కోసం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకునేందుకు వెనుకాడబోమన్న సంకేతాలను మోదీ ప్రభుత్వం ఇచ్చింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు దీనికి కొనసాగింపవగా, స్టాక్ మార్కెట్ల భారీ లాభాలకు ఇది దోహదపడింది. కాగా, వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ మూడు రెట్లకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలోకి 31,327 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఫలితంగా మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 56,944 కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలోకి 2,394 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి 20,364 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం 22,758 కోట్ల రూపాయల (3.5 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చినట్లైంది. అలాగే మే నెలా సుమారు 25 వేల కోట్ల రూపాయలు వచ్చాయ. ఫలితంగా ఫిబ్రవరి-మే మధ్య వచ్చిన పెట్టుబడుల విలువ 1.33 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. జూన్‌లో మొత్తం 29 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చారు విదేశీ మదుపరులు. ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరి-జూన్ మధ్య వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 22.66 బిలియన్ డాలర్లను తాకింది. మరోవైపు ఈ మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56,000 కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల ఉపసంహరణ జరిగింది.
దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు 49,000 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇక ఈ ఏడాది జనవరిలో 3,496 కోట్ల రూపాయలు వెనక్కిపోగా, అంతకుముందు మూడు నెలలతో కలిపి చూసినట్లయతే నిరుడు అక్టోబర్ నుంచి ఈ జనవరి వరకు నాలుగు నెలల్లో 80,310 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు దెబ్బతినడమే కారణం. కాగా, ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల విలువ 2 లక్షల కోట్ల రూపాయలకు చేరువలో ఉంది.