బిజినెస్
ఎస్బిఐ కొత్త చైర్మన్గా రజనీష్ కుమార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 October 2017
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ కొత్త చైర్మన్గా రజనీష్కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన రజనీష్కుమార్కు పేరుకుపోయిన రానిబాకీల సమస్య ఓ పెద్ద సవాలుగా మారబోతోంది. అక్టోబర్ 7న చార్జి తీసుకున్న నాటినుంచి మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సిబ్బంది శిక్షణా వ్యవహారాల విభాగం బుధవారం ఓ ప్రకటన జారీచేసింది. 59 సంవత్సరాల రజనీష్కుమార్ 2015 మే 26న ఎస్బిఐ బోర్డులో చేరారు. అంతకుముందు ఎస్బిఐ కేపిటల్ మార్కెట్ లిమిటెడ్లో పనిచేశారు.