బిజినెస్

త్వరలో రూ.20 వేల కోట్లు సేకరించనున్న టిటిఎంఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: త్వరలో తమ ప్రమోటర్లకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ప్రిఫరెన్స్ షేర్లను లేదా బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.20 వేల కోట్ల మేరకు నిధులను సమీకరించాలని యోచిస్తున్నట్లు టాటా గ్రూపునకు చెందిన లిస్టెడ్ టెలికామ్ సంస్థ టిటిఎంఎల్ (టాటా టెలీ సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్) శనివారం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 18వ తేదీన తమ డైరెక్టర్ల బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు టిటిఎంఎల్ ఒక నోటీసు ద్వారా స్టాక్ ఎక్స్‌చేంజీకి తెలిపింది. అయితే ఈ నిధులను ఎందుకు సమీకరించనున్నదీ ఆ సంస్థ వెల్లడించలేదు.