బిజినెస్

మార్కెట్‌లోకి స్కైవిన్ సెల్‌ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 5: దేశీయ ఫోన్ల తయారీ సంస్థ స్కైవిన్ కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఆదివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ ఫోన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సెల్‌ఫోన్ లేని వ్యక్తి లేడని, మార్కెట్‌లోకి ఎన్ని రకాల ఫోన్లు వచ్చినా విక్రయాలు కొనసాగుతూనే ఉండటం దీనికి నిదర్శనమన్నారు. సంస్థ నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాధారణ, మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించిన ఫోన్లను ఆవిష్కరించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాతూరి వెంకటేశ్వరరావు, సంస్థ ఎండి సురేష్, ఉద్యోగ సంఘం నాయకులు విఠల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కొత్త ఫోన్లను ఆవిష్కరిస్తున్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు