బిజినెస్
17శాతం ప్రీమియంతో లిస్టయిన ఆర్ఎన్ఏఎం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, నవంబర్ 6: అనిల్ అంబానీ గ్రూపు నియంత్రణలోని రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ (ఆర్ఎన్ఎఎం) షేర్లు సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఇ)లో 17 శాతానికి పైగా ప్రీమియంతో లిస్టయ్యాయి. ఆర్ఎన్ఎఎం ఇష్యూ ధర రూ. 252 కాగా, ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఇలో సోమవారం 17.42 శాతం ప్రీమియంతో రూ. 295.90 వద్ద లిస్టయ్యాయి. లిస్టయిన కొన్ని నిమిషాల్లోనే ఈ కంపెనీ షేర్ల ధర గరిష్ఠంగా రూ. 299కి ఎగబాకింది. తరువాత కనిష్ట స్థాయి రూ. 278కి పడిపోయింది. షేర్ మార్కెట్లో లిస్టయిన తొలి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్ఎన్ఎఎం. కాగా, ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలలో మూడో అతి పెద్ద కంపెనీ.
చిత్రం..సోమవారం ఆర్ఎన్ఎఎం లిస్టింగ్ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన తల్లి కోకిలాబెన్, కుమారుడు, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ, భార్య టీనా అంబానీ.