బిజినెస్

జలగం సుధీర్‌కు ‘హింద్ రతన్’ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో భాగంగా అందించే ప్రఖ్యాత హింద్ రతన్ అవార్డు-2018కు కోదాడకు చెందిన యువ ఎన్‌ఆర్‌ఐ సుధీర్ జలగం ఎన్నికయ్యారు. విదేశాల్లో భారత దేశ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంచేందుకు పాటుపడిన ఎన్‌ఆర్‌ఐలకు ఈ అవార్డును అందిస్తారు. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి శనివారం సుధీర్ జలగంకు లేఖ అందింది. కాగా వచ్చే ఏడాది జనవరి 9న బ్యాంకాక్‌లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌లో సుధీర్ జలగం అవార్డు అందుకోనున్నారు. కోదాడవాసి అయన సుధీర్ జలగంకు ప్రఖ్యాత అవార్డు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.