బిజినెస్

వచ్చేనెల నాలుగో విడత పసిడి బాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: నాలుగో విడత పసిడి బాండ్ల పథకం జూన్ ఆఖర్లో మొదలవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) డిప్యూటి గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘నాలుగో దశ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ వచ్చే నెలాఖర్లో మార్కెట్‌లోకి రావచ్చు.’ అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భౌతికంగా బంగారం డిమాండ్‌ను తగ్గించాలన్న లక్ష్యంతో ఈ పసిడి బాండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినది తెలిసిందే. అయితే మదుపరుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ పథకాన్ని ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా చేస్తోంది.