బిజినెస్

తొలి ఎకనామిక్ సిటీగా జక్కంపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: గ్రామాల్లో అన్ని వౌలిక వసతులు కల్పించి పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ రూరల్ జక్కంపూడి-షాబాద్ బీసీ కాలనీలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా జక్కంపూడిలో ఎకనామిక్ సిటీ నిర్మంచనున్నామన్నారు. ఈ సిటీలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు ఇక్కడి వారికే కల్పిస్తామని మంత్రి తెలిపారు. మార్చి మాసాంతానికి అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేయాలని, లేకుంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి గ్రామాల్లో కూర్చుని దీక్ష చేస్తారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సంవత్సరంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేస్తామన్నారు.