బిజినెస్
రెండింతల పెరుగుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 31 January 2018
న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో తన నికర లాభాన్ని దాదాపు రెండింతలు పెంచుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పాటు చమురు శుద్ధి లాభాలు పెరగడం వల్ల ఈ సంస్థ నికర లాభాలు క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే బాగా పెరిగాయి. 2017 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో ఐఓసీ రూ. 7,883.22 నికర లాభాలను ఆర్జించింది. అంటే ఒక్కో షేర్పై రూ. 16.63 చొప్పున నికర లాభాన్ని ఆర్జించింది.
క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐఓసీ రూ. 3,994.91 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంటే ఒక్కో షేర్పై రూ. 8.43 చొప్పున నికర లాభాన్ని ఆర్జించింది.