బిజినెస్

కరెన్సీ కొరత తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల్లో కరెన్సీ కొరత లేకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మాణిక్యాల రావు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవడేకర్, అల్పోన్స్ కన్నన్‌తనంలతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఏపీలో కరెన్సీ కొరత లేకుండా చూడాలని కోరినట్టు తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్పోన్స్ కన్నన్‌తనంను కలిసి ఏపీలోని బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. నెల్లూరు జిల్లాలో స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ.29.94కోట్లు గతంలో రిలీజ్ చేశారని, మిగతా పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు.