బిజినెస్

మరో 20 రూట్లలో ‘ట్రూజెట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్ అనతికాలంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనుంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ట్రూజెట్’ పశ్చిమ, తూర్పు తీరం, ఈశాన్య భారతం నుంచి కూడా విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా మరో 20 రూట్లలో తన సేవలను ప్రారంభించనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, అసోం రాజధాని గౌహతి నుంచి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడపనుంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా 12 ప్రాంతాలకు రోజూ కనీసం 2వేల మందిని వివిధ ప్రాంతాలకు తీసుకెళుతున్న ట్రూజెట్ సంస్థ త్వరలో ప్రయాణికులను నాలుగింతలకు పెంచుకోవాలనే లక్ష్యంతో కార్యకలాపాలను విస్తరిస్తోంది. ట్రూజెట్ సేవలను మరిన్ని నూతన రూట్లకు విస్తరింపజేస్తామని టర్బో మేఘా ఎయిర్వేస్ లిమిటెడ్ వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షణ అధికారి సెంథిల్ రాజా తెలిపారు. ఉడాన్ పథకం రెండో దశ కింద తమ సంస్థ 20 రూట్లలో విమానాలు నడిపేందుకు అనుమతి పొందిందని తెలిపారు. తాము అనుమతి పొందిన రూట్లలో అహ్మదాబాద్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, మహారాష్టల్రోని నాసిక్, జలగావ్లతో పాటు గౌహతి నంచి ఈశాన్య రాష్ట్రాల్లోని కుచ్ఛిబెహర్, బురాన్పూర్, తేజు, తేజ్‌పూర్, తదితర మార్గాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 25న తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తమ సంస్థ విమాన సర్వీసులు ప్రారంభిస్తుందని తెలిపారు.
రెండున్నరేళ్లలో 10లక్షల మంది ప్రయాణం
సంస్థ స్థాపించిన రెండున్నర సంవత్సరాల్లోనే 10లక్షల మంది ప్రయాణికులను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన ట్రూజెట్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విమానాలు నడుపుతోంది. 2015 జూలై 12న రెండు విమానాలతో ప్రారంభమైన ట్రూజెట్ సంస్థ ఈ ఏడాది జనవరి 19 నాటికి తమ సంస్థలో ప్రయాణించే 10వ లక్ష ప్రయాణికుడిని హైదరాబాద్ నుంచి గోవా మార్గంలో తీసుకెళ్లింది. ప్రస్తుతం ట్రూజెట్ ఐదు విమానాలను దేశంలోని వివిధ మార్గాల్లో నడుపుతోంది. ప్రతిరోజూ 13 ప్రాంతాలకు 32 సర్వీసులు నడుపుతోంది. వీటిద్వారా ఈ ఏడాది జనవరి 19 నాటికి 10లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేసిన ట్రూజెట్ మరో 50 రోజుల్లోనే లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసింది.
త్వరలో మరో ఏడు విమానాలు
ట్రూజెట్ సంస్థ త్వరలో మరో ఏడు విమానాలను తన సేవల్లో చేర్చబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం తొలి దశలో 18 రూట్లను పొందిన ట్రూజెట్ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే విమాన సర్వీసులు ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వింగ్స్ ఇండియా- 2018లో ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసి దేశంలోని ప్రయాణికులు విమానయానానికి ఉత్సాహం చూపేలా అవగాహన కల్పిస్తున్నట్లు సెంథిల్ రాజా తెలిపారు. తమ విమానాల్లో టికెట్ ప్రారంభ ధర 599 రూపాయలేనన్నారు. ప్రయాణికులకు ఉచితంగా అల్పాహారం, ఆహారం అందిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరులకు తొలుత సర్వీసులు ప్రారంభించిన ట్రూజెట్ అనతికాలంలోనే ఔరంగాబాద్, చెన్నై, కడప, గోవా, ముంబై, నాందేడ్, బళ్ళారి, మైసూర్ ప్రాంతాలకు విమాన సర్వీసులను విస్తరించింది.