బిజినెస్

30 వేలు దాటిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జొన్ 16: బంగారం ధరలు గురువారం 30 వేల రూపాయల మార్క్‌ను దాటి పోయాయి. ఒక్కరోజే రూ.580 పెరగడంతో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాములు రూ. 30,250 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటుగా దేశీయంగా కూడా డిమాండ్ పెరగడమే బంగారం ధర పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయిదు వారాల్లో బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. వెండి సైతం కిలో 700 రూపాయలు పెరిగి 42 వేల రూపాయలకు చేరుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులనుంచి కొనుగోళ్లు పెరగడం వెండి ధర పెరగడానికి కారణమని నిపుణులు అంటున్నారు. భారత మార్కెట్‌లో ధరలను నిర్ణయించే సింగపూర్ మార్కెట్లో బంగారం ధర 1.4 శాతం పెరిగి ఔన్స్‌కు1309.89 అమెరికా డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.