బిజినెస్

ఇక ఇంటింటికీ గ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: దేశంలో 174 జిల్లాల్లో సీఎన్‌జీ గ్యాస్, ఇంటింటికీ పైప్ ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేసేందుకు సంబంధించి 86 అనుమతులను ఇచ్చేందుకు వీలు గా అతి పెద్ద బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం మంగళవారం ప్రారంభించింది. 174 జిల్లాలకు సీఎన్‌జీ గ్యాస్, పైప్ ద్వారా వంట గ్యాస్ సరఫరాకోసం 86 భౌగోళిక ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 174 జిల్లాలు విస్తరించి ఉంటాయి. ఈ వివరాలను పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రకటించింది. ఈ భౌగోళిక ప్రాం తాల్లో 29 శాతం దేశ జనాభా నివసిస్తోంది. ఈ విధానంపై ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన రోడ్ షోను కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎన్‌జీ, ఇంటింటికీ పైప్ ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థ అభివృద్ధి చెందితే రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. బిడ్డింగ్ ప్రక్రియ ముగింపు తేదీ జులై 10వ తేదీ అని ఆయన చెప్పారు. ప్రధాన ఇంధన మార్కెట్‌లో సహజవాయువు సరఫరాను 6 నుంచి 15 శాతానికి పెంచాలనే లక్ష్యంతో పాటు, 2020 నాటికి కోటి కుటుంబాలకు వంట గ్యాస్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భోపాల్, అహ్మద్‌నగర్, లూథియానా, జలంధర్, బర్మర్, ఆల్వార్, కోట, కోయంబత్తూరు, సేలం, అలహాబాద్, ఫైజాబళాద్, అమేథి, రాయబరేలి, డెహ్రాడూ న్, బర్డ్వాన్‌లో 9వ దశ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను అమలు చేస్తామన్నారు. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, గెయిల్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా 240 మిలియన్ల జనాభాకు గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఇందులో 42 ల క్షల మంది గృహ వినియోగదారులు, 31లక్షల మంది సీఎన్‌జీ వాహనాల వినియోగదారులు ఉన్నారన్నారు. 56 భౌగోళిక ప్రాం తాల్లో ఈ వినియోగదారులు ఉన్నారన్నారు. మిగిలిన చోట్ల ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో బిడ్స్‌ను కేటాయిస్తుందన్నారు. తమ ప్రాంతంలో ఎన్ని సీఎన్‌జీ స్టేషన్లు, ఎంత మంది కుటుంబాలకు వంట గ్యాస్ సరఫరా చేస్తారో వివరాలను బిడ్స్‌లో పేర్కొనాలని కోరినట్లు మంత్రి చెప్పారు.