బిజినెస్

సీఎంతో అనిల్ అంబానీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రిలయన్స్ ఏడీఏ గ్రూపు అధినేత అనిల్ అంబానీ వెలగపూడి సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రాంబిల్లిలో ఆ గ్రూపు నిర్మించనున్న నేవల్ షిప్ బిల్డింగ్ యార్డుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విశాఖకు 70 కిలోమీటర్ల దూరంలోని రాంబిల్లిలో షిప్ బిల్డింగ్ యార్డును దాదాపు 5000 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో 2016లో అవగాహన ఒప్పందాన్ని ఏడీఏ గ్రూపు కుదుర్చుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాల భూమిని కేటాయించింది. భూమి కేటాయించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఎలాంటి పనులను ప్రారంభించకపోవడంతో భూకేటాయింపులను రద్దుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈనేపథ్యంలో సీఎంతో అనిల్ అంబానీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ విద్యుత్ ప్రాజెక్టులపై కూడా వారు చర్చించారు. అయితే సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు అనిల్ తెలిపారు. నవ్యాంధ్ర రాజధానిని బ్లూ అండ్ గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేయాడాన్ని అభినందించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజధాని అమరావతిని నిర్మించడంపై సీఎంను ఆయన అభినందించారు.

చిత్రం..అనిల్ అంబానీని జ్ఞాపికతో సత్కరిస్తున్న సీఎం చంద్రబాబు