బిజినెస్

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పన్యాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పన్యాల భూపతిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఇంతవరకు ఈ పోస్టులో కొనసాగిన పేర్వారం రాములు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో పన్యాల భూపతిరెడ్డిని నియమించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈయన పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. పన్యాల భూపతిరెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి గ్రామానికి చెందినవారు కాగా ప్రస్తుతం ఈయన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. కాగా, సర్వశిక్షా అభియాన్ సంచాలకుడిగా టి విజయకుమార్‌ను నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తికాలిక సంచాలకుడిగా ఈయన్ను నియమించినట్టు పేర్కొన్నారు.