బిజినెస్

ముఖేష్ అంబానీ వేతనం రూ. 15 కోట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: భారతీయ శ్రీమంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేష్ అంబానీ వరుసగా పదవ ఏడాది కూడా తన వార్షిక వేతనం రూ.15 కోట్లకే పరిమితం చేశారు. 2008-09 నుంచి తన వార్షిక వేతనం రూ.15 కోట్ల మేర ముఖేష్ అంబానీ డ్రా చేస్తున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజా నివేదికలో పేర్కొంది. ఇదే కంపెనీలో ఇతర సిఇవోల వేతనాలు అదే కాలంలో పెరుగుతూ వచ్చాయి. అంబానీ బంధువులు నిఖిల్ ఆర్ మేశ్వాని, హిటల్ ఆర్ మేశ్వాని వేతనం సాలీనా రూ. 19.19 కోట్లకు చేరిం ది. వీరి వేతనం 2016-17లో రూ.16.58 కోట్లు ఉండేది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ వేతనం రూ.7.87 కోట్ల నుంచి రూ.8.99 కోట్లకు, రిఫైనరీ చీఫ్ పవన్ కు మార్ వేతనం రూ.3.47 కోట్లకు పెరిగింది. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతూ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమెకు ప్రతి బోర్డు సమావేశానికి సిటింగ్‌కు రూ. 6 లక్షలు చెల్లిస్తున్నారు.