బిజినెస్

మూడు శాతం పెరిగిన విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: భారత్‌లో విదేశీ పెట్టుబడులు 3 శాతం పెరిగాయని, దీని వల్ల 2017-18లో 61.96 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిఐపిపి కార్యర్శి రమేష్ అభిషేక్ తెలిపారు. అంతకు ముందు ఏడాది విదేశీ పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లు వచ్చాయన్నారు. గత నాలుగేళ్లలో దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 222.75 డాలర్లని చెప్పారు. అంతకు ముందు నాలుగేళ్లలో 152 బిలియన్ డాలర్లు వచ్చాయన్నారు. రక్షణ, వైద్య సేవలు, నిర్మాణ రంగం, అభివృద్ధి, రిటైల్, పౌరవ ఇమానయాన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఉన్న నిబంధనలను సరళీకృతం చేశామన్నారు. సేవా రంగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, నిర్మాణం, ట్రేడింగ్, ఆటోమొబైల్ రంగాల్లో ఎక్కువగా విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. మారిషస్, సింగపూర్, జపాన్, నెదర్లాండ్స్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు.
కాగా యుఎన్‌సిటిఏడి నివేదిక ఫ్రకారం భారత్‌లో విదేశీపెట్టుబడులు 44 బిలియన్ డాలర్లనుంచి 40 బిలియన్ డాలర్లకు తగ్గాయన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో భారత్ పెట్టుబడులు రెట్టింపయ్యాయి. కాగా కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఓవర్సీస్ ఇనె్వస్ట్‌మెంట్స్‌ను వృద్ధి చేసేందుకు వీలుగా విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డును ఏర్పాటు చేశామన్నారు. ఐఫోన్‌మేకర్ యాపిల్, అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ మేజర్ తెస్లా సంస్థలు భారత్‌లో పెట్టుబడులకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఈ రెండు సంస్థల నుంచి ప్రతిపాదనల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఐ ఫోన్, ఐపాడ్ తయారీ సంస్థలు కొన్ని రాయితీలు కోరాయని ఆయన చెప్పారు.