బిజినెస్

జీఎస్‌టీ వల్ల ఆశించిన ఫలితాలేమీ లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి: వస్తు సేవా పన్నును (జీఎస్‌టీ) అమలులోకి వచ్చి వచ్చే జూలై 1వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో ఆశించినట్లుగా ఆర్థిక వ్యవస్థను జీఎస్‌టీ బలోపేతం చేయలేకపోయిందని, ఒక దేశం, ఒక పన్ను అనే విధానం వల్ల నగదుకు డిమాండ్ పెరిగిందని ఒక ఆర్థిక రంగంలో విదేశీ బ్రోకరేజి సంస్థ నివేదికలో పేర్కొంది. ఇచ్చిన హామీలను తగ్గట్టుగా జీఎస్‌టీ వల్ల ఫలితాలు రాలేదని బ్రిటీష్ బ్రోకరేజీ హెచ్‌ఎస్‌బీసి సంస్థ పేర్కొంది. రానున్న సంవత్సరాల్లో మాత్రం జీఎస్‌టీ వల్ల ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందని ఆ సంస్థ అంచనా వేసింది.
గత ఏడాది జూలై 1వ తేదీన జీఎస్‌టీని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పన్ను విధానంలో చాలా మార్పులు తెచ్చారు. అనేక వస్తువులపై పన్నులను తగ్గించారు. అనేక వస్తువులపై సెస్సులను, లెవీ రేట్లను పెంచారు. పన్ను రిఫండ్లలో ఆలస్యం జరుగుతోంది. కాగా నగదులావాదేవీలు పెరగడం ఆశ్చరంగా ఉందని ఆ సంస్థ పేర్కొంది. దీని వల్ల నగదు చలామణి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, జీఎస్‌టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందన్నారు.
కొత్తగా ఒక కోటి మంది ఆదాయం పన్ను చెల్లింపుదార్లు పెరిగారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుకు ముందున్న పరిస్థితి నెలకొందని హెచ్‌ఎస్‌బిసి బ్రోకరేజి సంస్థ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నగదు లావాదేవీలు ఎక్కువని, దీని వల్ల నగదుకు డిమాండ్ పెరుగుతుంది. జీఎస్‌టీ బలపడే కొద్దీ, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇ వే బిల్స్ వ్యవస్థ వేళ్లూనుకోవాలి. వ్యాపారులకు రీఫండ్స్‌ను త్వరితగతిన చెల్లించాలి. ఐటి వ్యవస్థ మెరుగుపాలి. పన్ను ఎగవేతలు తగ్గుముఖం పడుతాయి. ఇవన్నీ రానున్న కాలంలో సంభవించే పరిణామాలని ఆ సంస్థ పేర్కొంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నగదు చెల్లింపులు పెరుగుతాయని పేర్కొంది. వర్షపాతం బాగుండి, పంటలు బాగా పండి, గిట్టుబాటుధరలు లభిస్తే గ్రామ ప్రాంతాల్లో నగదు లావాదేవీలు ఇంకా జోరందుకుంటాయని ఆ సంస్థ పేర్కొంది.