బిజినెస్

ఎయిర్ ఇండియాకు రూ. 980 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: ఎయిర్ ఇండియాను బలోపేతం చేసేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.980 కోట్ల నిధులు అవసరమవుతాయని, దీనికి ఆమోదం తెలియచేయాలని కేంద్రం పార్లమెంటును కోరింది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను విక్రయించేందుకు ఆఫర్ ఇచ్చినా, కొనుగోలుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ఎయిర్ ఇండియా నిర్వహణకు ఈ ఏడాదికి రూ.980కోట్లు కావాలని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మంగళవారం లోక్‌సభను కోరారు. బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో ఎయిర్ ఇండియాను విక్రయించే ప్రతిపాదనకు కేంద్రం తాత్కాలికంగా స్వస్తి చెప్పింది. బకాయిలు చెల్లించేందుకు రూ.2121 కోట్ల మేర నిధులు కావాలని ఎయిర్ ఇండియా సంస్థ కేంద్రాన్ని కోరింది. ప్రత్యామ్నాయ మార్గాలను ఆనే్వషిస్తూనే, ఎయిర్ ఇండియా బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని గత నెలలో పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. కాగా ఎయిర్ ఇండియా అమ్మకంపై తాజా ప్రతిపాదనలపై కేంద్రం వౌనంవహించింది. ఎయిర్ ఇండియాలో దాదాపు 27వ ఏల మంది ఉద్యోగులు ఉన్నారు. రోజూ వారీ ఆపరేషన్ల నిర్వహణకు రూ.1000 కోట్లు తక్షణ సహాయం అందించాలని ఎయిర్ ఇండియా కేంద్రాన్ని కోరిన విషయం విదితమే.