బిజినెస్

‘జిఎస్‌టి అమలు దేశానికే మేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని చూస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు దేశానికి ఎంతో మేలు చేస్తుందని జస్టిస్ గూడ రఘురాం అభిప్రాయపడ్డారు. ఇక్ఫాయి లా స్కూలు, ఇక్ఫాయి బిజినెస్ స్కూల్, నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ సంయుక్తం గా శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తు తం కేంద్ర, రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న సర్వీసు టాక్స్, సేల్స్ టాక్స్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, కేంద్రం ద్వారానే సదరు పన్నులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా వర్తింపచేయడమే జిఎస్‌టి విధానమన్నారు.