బిజినెస్
గణనీయంగా పెరుగుతున్న పత్తి ధరలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 July 2016
కేసముద్రం, జూలై 18: ఊహించని ధర పత్తికి లభిస్తోంది. వరంగల్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం గరిష్ఠంగా 6,500 రూపాయలు పలికింది. నాలుగు రోజుల క్రితం వరకు రోజుకు కొంత పెరుగుతూ 6,300 రూపాయలకు చేరగా.. సోమవారం ఉన్నట్టుండి అమాంతం 200 రూపాయలు పెరిగి 6,500 రూపాయలను తాకింది. దీంతో పెరిగిన ధరలు అటు వ్యాపారులకు, ఇటు రైతులకు ఆనందాన్ని కలిగించాయ. కాగా, సోమవారం మార్కెట్లో గరిష్ఠంగా 6,500, కనిష్టంగా 5,500 పలికిన క్వింటాల్ పత్తి ధర.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను మించిపోవడం మరో విశేషం. పత్తికి ఇంతగా ధర పలుకుతుందని తాము ఊహించలేకపోయామని అటు రైతులు.. ఇటు వ్యాపారులు పేర్కొంటున్నారు.