బిజినెస్

అమరావతిలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన నాలెడ్జ్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని విద్యావేత్తలు, విద్యాసంస్థలను ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏపీ సీఆర్‌డీఏ, సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ లీడర్‌షిప్ (సీఎస్‌ఎల్)
నేతృత్వంలో ‘ఆంధ్రప్రదేశ్ ఇండియాస్ ఎమర్జింగ్ నాలెడ్జ్ క్యాపిటల్’ పేరుతో వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ సదస్సుకు ఏపీ సీఆర్‌డీఏ చైర్మన్ చెరుకూరి శ్రీధర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఓఎస్‌డీ భావన సక్సేనా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటుకు, వృత్తి శిక్షణ సంస్థల ఏర్పాటుకు ముందుకు రావాలని విద్యావేత్తలకు పిలుపునిచ్చారు.