బిజినెస్
పీఎస్బీ బ్యాంకులకు ఊతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 December 2018
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న బ్యాంకులు (పీఎస్బీ)లకు ఊతమివ్వాలని నిర్ణయించామని, త్వరలోనే సుమారు 83,000 కోట్ల రూపాయలను ఈ రంగంలోకి విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్తో జైట్లీ పలు అంశాలను చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పీఎస్యూ బ్యాంకులకు రాబోయే రెండుమూడు నెలల్లో భారీ మొత్తాలను అందుబాటులో ఉంచుతామన్నారు. అనుబంధ డిమాండ్లు, గ్రాంట్ల కింద 41,000 కోట్ల రూపాయలను పీఎస్యూలకు అందించే ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం లభించాల్సి ఉందన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణలను తగ్గించడమేగాక, మళ్లీ పెట్టుబడులను ఉంచేందుకు పీఎస్యూ బ్యాంకులకు వీలు కల్పిస్తామని జైట్లీ తెలిపారు.