బిజినెస్

అపోల్ టైర్స్ ఎండీగా నీరజ్ కన్వర్ పదవీ కాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అపోల్ టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నీరజ్ కన్వర్ మళ్లీ నియమించే ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదించారని ఆ సంస్థ ప్రకటనలో తెలిపిందతి. దీంతో నీరజ్ కన్వర్ ఎండీ పదవిలో 2019 మే 28వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతారు. మొత్తం ఓట్లు 42.29 కోట్లలో 96.72 శాతం ఓట్లు కన్వర్‌కు అనుకూలంగా వచ్చినట్లు అపోలో టైర్స్ పేర్కొంది. 3.28 శాతం ఓటర్లు వ్యతిరేకించారు. దీని కోసం వాటాదారులను సమావేశపరిచి ప్రత్యేక తీర్మానం చేయించారు. అపోలో టైర్స్‌కు బలమైన వాటాదారుల మద్దతు ఉందని ఆ సంస్థ తెలిపింది. కంపెనీ, వాటాదారుల లాభాలను పెంచేందుకు, ఉద్యోగుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు సమర్థంగా పనిచేస్తామని ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మైనార్టీ షేర్ హోల్డర్లు కన్వర్‌ను ఎండీగా మళ్లీ నియమించాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన విషయం విదితమే.