బిజినెస్

మార్కెట్ దూకుడుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 22: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) ఈవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. వరుసగా ఏడో రోజు లాభాలను ఆర్జించి, బుల్ పరుగు కొనసాగుతుందనే అభిప్రాయాన్ని కల్పించింది. కానీ, చివరి రెండు రోజుల్లో మార్కెట్ దూకుడుకు కళ్లెం పడింది. వారంతంలో సెనె్సక్స్ పతనంతో ముగిసింది. ఈనెల 14వ తేదీన 35,962.93 పాయింట్లుగా ఉన్న సెనె్సక్స్ ఆతర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈవారం మొదటి రోజైన సోమవారం 36,270.07 పాయింట్లుగా నమోదైంది. ఆతర్వాత కూడా వరుసగా రెండు రోజుల పాటు సెనె్సక్స్ లాభాల బాటలో నడిచింది. 36,347.08, 36,484.33 పాయింట్ల చొప్పున పెరిగింది. దీనితో వరుసగా ఏడు రోజుల పాటు సెనె్సక్స్ పరుగులు తీసింది. కానీ, గురువారం మార్కెట్‌లో ప్రతికూల వాతావరణం కనిపించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, రూపాయి మారకపు రేటు బలపడడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. గురువారం ట్రేడింగ్‌లో తీవ్రమైన ఆటుపోట్లకు గురైన మార్కెట్ ఒకానొక దశలో 250 పాయింట్లకుపైగా నష్టపోయింది. కానీ, చివరిలో కోలుకోవడంతో, సుమారు 50 పాయింట్ల స్వల్ప నష్టంతో గట్టెక్కింది. అయితే, శుక్రవారం నాటికి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణ మార్కెట్‌ను శాసించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం కూడా జత కలవడంతో, సెనె్సక్స్ పతనం ఖాయమైంది. సుమారు 680 పాయింట్లు పడిపోయి, 35,742.07 పాయింట్ల కనిష్టానికి చేరింది. ఈనెల 14న నమోదైన 35,962.93 పాయింట్ల కంటే కూడా ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం నాటి ముగింపు తక్కువ కావడం గమనార్హం.