బిజినెస్

నీతి ఆయోగ్ ప్రతిపాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశంలో వైద్య రంగాన్ని ఒకే పరిధి కిందకు తెచ్చే ఉద్దేశ్యంతో జాతీయ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. వైద్య రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విఫలమయ్యాయని పేర్కొన్నారు. వీటి స్థానంలో జాతీయ స్థాయిలో మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయాలని విధానపత్రంలో నీతి ఆయోగ్ పేర్కొంది. నర్సింగ్ విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, వీటిని క్రమబద్ధీకరించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని పేర్కొంది. వైద్య రంగంలో ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయని తెలిపింది. వైద్యుల కొరత నివారించేందుకు విదేశాల్లో ఉన్న భారతీయ వైద్యులు స్వదేశానికి వచ్చేందుకు వీలు కల్పించాలని ప్రతిపాదించారు. ఎయిమ్స్, ఇతర పెద్ద ఆసుపత్రులకు విదేశాల్లో పనిచేసిన వైద్య నిపుణులను విజిటింగ్ ప్రొఫెసర్లుగా నియమించాలని పేర్కొన్నారు. డిప్లమో ఆఫ్ నేషనల్ బోర్డ్, డిప్లమో ఫ్రమ్ కలాజీ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్ల వ్యవస్థను విస్తరించాలని పేర్కొన్నారు. వైద్య రంగంలో డాక్టర్లు, నర్సుల సంఖ్య తగ్గిపోతోంది.