బిజినెస్

నెలాఖరులోగా మూడు బ్యాంకుల విలీన యత్నానికి కార్యరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాం క్, దేనా బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదన ఈనెలాఖరులోగా కార్యరూపం దాల్చనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జనవరి 8 వరకు జరిగే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బ్యాం కుల విలీన పథకం చర్చకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఈ మూడు బ్యాంకులకు సంబంధించిన బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి. ప్రమోటర్ నుంచి ఎంత మూలధనం అవసరం, వాటాల వివరాలపై కూడా స్పష్టత వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తొలిసారిగా జరుగుతున్న మూడు బ్యాంకుల విలీనం తర్వాత తగినన్ని నిధులు సమకూర్చేందుకు ప్ర భుత్వం హామీ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా ఈ బ్యాం కుల విలీనం అనంతరం వచ్చే సరికొత్త బ్యాంకు కార్యాచరణ మొదలవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది భారతీయ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసిన అనంతరం, భారతీయ మహిళా బ్యాంకు నిర్వహణను సైతం ఎస్‌బీఐ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచంలోని 50 ప్రముఖ బ్యాంకుల జాబితాలోకి ఈ బ్యాంకు చేరింది. ఆక్రమంలోనే మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి కూడా బాటలు పడ్డాయి. గత సెప్టెంబర్‌లో జరిగిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఆల్టర్నేటివ్ మెకానిజం (ఏఎల్) సమావేశంలో ఈ మూడు బ్యాంకుల విలీన ప్రతిపాదన తెరపైకి వచ్చింది.