బిజినెస్

బొగ్గు కొరత నివారణపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: విద్యుత్ ఉత్పాదనకు బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకుని వచ్చే యేడాది కోల్ ఇండియా లిమిటెడ్స్ (సీఐఎల్)కి అదనంగా గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఐసీకి కేటాయించిన బొగ్గుగనులతోబాటు అదనంగా 10 గనులు కేటాయించడం జరుగుతుందని, తద్వారా ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత అధికార వర్గాలు బుధవారం నాడిక్కడ వెల్లడించాయి. థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు దేశ వ్యాప్తంగా పలుచోట్ల బొగ్గు కొరతను ఈ యేడాది ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికే సీఐఎల్‌కి 85 బొగ్గు గనులను కేటాయించడం జరిగింది. వచ్చే యేడాది అదనంగా విద్యుత్ ఉద్పాదన కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా జరిగేలా మరో 10 గనులను సీఐఎల్‌కి కేటాయించడం జరుగుతుందని కోల్ ఇండియా సంయక్త కార్యదర్శి ఆశిష్ ఉపాధ్యాయ వెల్లడించారు. మొత్తం వంద మిలియన్ టన్నులకు బొగ్గు సరఫరాను పెంచాలన్న లక్ష్యం ఉందని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తుల్లో 80 శాతం కోల్ ఇండియా పరిధిలోనే జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత యేడాది బొగ్గు కొరతకు ఉత్పత్తికన్నా డిమాండ్ పెరగడమే కారణమని తెలిపారు. ఐతే ఆ సవాళ్లను అధిగమించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ దిశగా లక్ష్యాన్ని సాధించిందన్నారు. అయితే విద్యుత్ ఉత్పాదన కేంద్రాల్లో బొగ్గు స్టాకులు తక్కువగా పెట్టుకోవడంవల్ల కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గడచిన మే నెలలో బొగ్గు నిల్వలకు సంబంధించి 33 విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ వస్తోందని, ప్రస్తుతం దాదాపు 10 కేంద్రాలు మాత్రమే సమస్యను ఎదుర్కొంటున్నాయని ఉపాధ్యాయ వివరించారు. ప్రతి ఉత్పాదక కేంద్రంలో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వచ్చే యేడాది మూడో త్రైమాసికం నుంచే దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తులు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో వచ్చే సంవత్సరం కనీసం పది శాతం అభివృద్ధి రేటును సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ యేడాది ఇప్పటికే 8 శాతం అదనపు బొగ్గు ఉత్పత్తి జరిగిందని, గత యేడాదితో పోలిస్తే ఇది చాలా అధికమని తెలిపారు. డాలర్ విలువ పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు దిగుమతికి ఇబ్బందులున్నాయని, అందుకే వీలైనంత అధికంగా దేశీయంగానే బొగ్గు సేకరణకు కృషి జరుగుతోందని ఆవిష్ ఉపాధ్యాయ చెప్పారు.