బిజినెస్

మళ్లీ పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 26: ఆరంభంలో కొంత ఊగిసలాటకు గురైనప్పటికీ బుధవారం స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికన్ మార్కెట్లలో తలెత్తిన సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఈక్విటీలు ఆరంభంలో బెంచ్ మార్కుకన్నా దిగువన ట్రేడై నష్టాల బాటపట్టినా తర్వాత బాగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ మూడు రోజుల నష్టాల పరంపరను దాటి బుధవారం 179.79 పాయింట్లు ఎగబాకి 0.51 శాతం లాభాలతో 35,649.94 వద్ద ముగిసింది. ఆరంభంలో ఇండెక్స్ 35,010.82కన్నా దిగువకు చేరుకుని తిరిగి క్రమంగా బలపడటం జరిగింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 66.35 పాయింట్లు లాభపడి 10.700 పాయింట్ల మార్కును దాటి 0.62 శాతం లాభాలతో 10.729.85 వద్ద ముగిసింది. తొలుత ఊగిసలాటలో ఉన్న సూచీలు మధ్యాహ్నం తర్వాత గణనీయంగా బలపడ్డాయి. ప్రధానంగా నిఫ్టీ లాభాల బాటలోపడి ఈ సంవత్సరాంతం వరకు ఈ ట్రెండును కొనసాగించే అవకాశాలున్నాయని, భారీ మార్కెట్లలో నిఫీ మాత్రమే ఈ క్యాలండర్ సంవత్సరానికి సానుకూల సంకేతాలతో ఉందని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో విరాల్ బెరావాలా విశే్లషించారు. గత సెషన్‌ను 271.92 పాయింట్ల తక్కువగా 35,470.15 వద్ద ముగించిన సెనె్సక్స్, 90.50 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ క్రిస్మస్ సెలవుదినం తర్వాత పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా అమెరికాలో రాజకీయ స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్న ఇనె్వస్టర్లు కొత్త పెట్టుబడుల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఈక్రమంలో స్వల్పకాలికంగా ద్రవ్యలభ్యత, సెంటిమెంటుపై మార్కెట్ల స్థితిగతులు ప్రభావం చూపే అవకాశం ఉందని బీఎన్‌బీ ప్రభాస్ నేతృత్వంలోని షరేఖన్ సంస్థ సలహా విభాగం అధిపతి సేమాంగ్ జానీ తెలిపారు. ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక స్టాక్‌లతోడ్పాటుతోనే నిఫ్టీ 10,700 మార్కును దాటగలిగిందని ఆయన వివరించారు. కాగా బుధవారం అధిక లాభాలను ఆర్జించిన సంస్థల్లో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎప్‌సీ డుయో, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్‌లు ఉన్నాయి. ఈ కంపెనీలు సుమారు 4 శాతం లాభాలను ఆర్జించడం విశేషం. మరోవైపు సన్‌పార్మా, యెస్ బ్యాంక్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టాటామోటార్స్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ స్వల్పంగా నష్టపోయి 2 శాతం నష్టాలతో రోజును ముగించాయి. అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ బలపడి 70.08 రూపాయల వద్ద నిలిచింది. అలాగే ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 0.73 పెరిగి బ్యారెల్ 51.14 డాలర్లు పలికింది. ఇలావుండగా విదేశీ మదుపర్లు సోమవారం 577.10 కోట్ల విలువైన షేర్లు అమ్మకాలకు పెట్టిన సంగతి తెలిసిందే. అదే రోజున దేశీయ ఇనె్వస్టర్లు 186.14 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.