బిజినెస్
పీఎన్బీకి ఈసీబీ ద్వారా 265 మిలియన్ డాలర్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 January 2019
ముంబయి, జనవరి 2: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హౌసింగ్ ఫైనాన్స్ విభాగం తాజాగా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ) ద్వారా 265 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకుంది. డిసెంబర్ నెల చివరి వారంలో ఈ నిధులను సమకూర్చుకున్నామని, దీనిని గృహ రుణాల కోసం వినియోగిస్తామని మీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘జాయ్విల్లే-హించావాడీ’ ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించామని, ఇది 2022 సంవత్సరానికి పూర్తవుతుందని వివరించింది. దీని కోసం 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. ముంబయి, పుణేతోపాటు పశ్చిమ బంగాల్లోని కొన్ని నగరాల్లోనూ గృహ నిర్మాణాలను చేపడతామని వివరించింది.