బిజినెస్

లాభపడనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 2: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)కు సంబంధించిన మొండి బకాయిల విషయంలో రిజర్వుబ్యాంకు తీసుకున్న నిర్ణ యం పట్ల బ్యాంకర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో బ్యాంకులకు పెద్దయెత్తున ఉన్న వత్తిడి దీనివల్ల తగుతుందని స్థానిక బ్రోకరేజ్ కంపెనీ అధ్యయన నివేదిక వెల్లడించింది.
ఎంఎస్‌ఎంఈల్లో బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేక డీఫాల్టర్లుగా మారిన పరిశ్రమలకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద 25 కోట్ల రూపాయల వరకు రుణాన్ని పునర్వ్యవస్థీకరణ (రీస్ట్రక్చర్) చేయాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వత్తిడిమేరకే ఇలాంటి నిర్ణయం ఆర్బీఐ తీసుకుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ‘మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) రుణ వసూళ్ల విషయంలో పెద్ద స్థాయిలో వత్తిడిని ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని బుధవారం విడుదల చేసిన కోటక్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి నష్టాల్లో సాగుతూ రుణాలివ్వడంపై ఆంక్షలున్న ‘ప్రాంప్ట్ కరెక్టివ్ ఆక్షన్ ఫ్రేమ్ వర్క్’ (పీసీఏఎప్‌డబ్ల్యు) పథకం కింద ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు కలుగుతుందని ఆ నివేదిక వివరించింది. ‘సెంట్రల్ బ్యాంకు నోటిఫికేషన్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. రుణాల వసూళ్లు ఆలస్యం అవుతాయని సంకేతాలుండటం వల్ల బ్యాంకర్లు తదుపరి రుణాలివ్వడానికి వెనుకంజ వేశారు. ఈక్రమంలో కేంద్ర నిర్ణయం బ్యాంకర్లు ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయం దోహదపడుతుంద’ని ఆ నివేదిక పేర్కొంది. గత యేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న గణాంకాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది.
రుణాలను పునర్వ్యవస్థీకరించిన బ్యాం కులకు ఆ అప్పులు సైతం స్థిరాస్తుల జాబితాలోకి చేరుతాయి. ప్రత్యేకించి డీమానిటరైజేషన్, జీఎస్టీ వల్ల దెబ్బతిన్న బ్యాంకులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తం కాగలదని నివేదిక వివరించింది.