బిజినెస్
తక్కువ ధరకు ఎక్స్యూవీ వాహనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 February 2019
ముంబయి, ఫిబ్రవరి 14: ఎక్స్యూవీ-500 సిరీస్లో తక్కువ ధరతో కొత్త వాహనాన్ని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మొడల్ను ఎక్స్యూవీ-300గా ప్రకటించింది. ఈ సబ్-4 మీటర్ వాహనం పెట్రోలు, డీజిల్ వర్షన్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ధర 7.90 నుంచి 8.49 లక్షల రూపాయల మధ్య ఉంటుందని వివరించింది. 2011లో ఎక్స్యూవీ-500ను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు భారీ డిమాండ్ వచ్చిందని గుర్తుచేసింది. అదే తరహాలో ఎక్స్యూవీ-300 వాహనాలకు కూడా డిమాండ్ భారీగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.