బిజినెస్

బీహార్‌లో సెయిల్ కొత్త యూనిట్‌కు నేడు ప్రారంభోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: బీహార్‌లోని చాంపారన్ జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నెలకొల్పిన కొత్త యూనిట్‌కు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేందర్ సింగ్ సోమవారం ప్రారంభోత్సవం చేస్తారు. ప్రస్తుతానికి ఆ యూనిట్‌లో స్టీల్ పైపులను సెయిల్ ఉత్పత్తి చేస్తుంది. సోమవారం కేంద్ర మంత్రి లాంఛనంగా ప్రారంభించిన వెంటనే, ఈ యూనిట్‌లో ఉత్పత్తి మొదలవుతుందని సెయిల్ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. 50,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో, 2007 నవంబర్‌లో ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఇందులో ఒక స్లిట్టింగ్ లైన్, రెండు ట్యూబ్ మిల్స్ ఉన్నాయి. గత నెల 31వ తేదీన అన్ని వసతులతో ఈ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్‌చే ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నది.