బిజినెస్

పెరగనున్న సిమెంట్ వినియోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 28: దేశంలో సిమెంట్ వినియోగం 2020లో 6 నుంచి 8 శాతం పెరిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు గృహ నిర్మాణం, వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడం ఇందుకు దోహదం చేయవచ్చని ఇండియా రేటింగ్స్ అధ్యయన నివేదిక పేర్కొంది. వరుసగా ఈ సంవత్సరం కూడా డిమాండ్ అధికంగా ఉన్నందువల్ల సిమెంట్ తయారీదార్లు సైతం మంచి లాభాలను సంతరించుకునే వీలుందని తెలిపింది. వ్యక్తిగత గృహ నిర్మాణం, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణంతోబాటు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల రంగాల్లో సైతం సిమెంట్ వినియోగం గణనీయంగా పెరిగిందని, ఈ పెరుగుదల మరో రెండేళ్లు కొనసాగుతుందని అంచనావేసింది. 2019 నుంచి 2021 మధ్య నిర్మాణ రంగ రంగంలో సిమెంట్ వినియోగ సామర్ధ్యం సంవత్సరానికి 20 మిలియన్ టన్నుల వరకు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. 2020లో ఈ పెరుగుదల అధికంగా ఉంటుందని పేర్కొంది. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య తేడావల్ల వచ్చే సంవత్సరం సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉందని కూడా నివేదిక పేర్కొంది.