బిజినెస్
పుంజుకున్న పసిడి ధర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 8 March 2019
న్యూఢిల్లీ, మార్చి 8: బులియన్ మార్కెట్ శుక్రవారం మళ్లీ లాభాల బాట పట్టింది. గురువారం నాటి ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పడిపోగా, కిలో వెండి ధర 520 రూపాయలు పతనమైంది. విదేశీ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించకపోవడంతోపాటు, దేశీయ నగల వర్తకులు కూడా వెనుకంజ వేయడంతో బులియన్ మార్కెట్కు నష్టాలు తప్పలేదు. అయితే, శుక్రవారం నాటి ట్రేడింగ్ అందుకు భిన్నంగా సాగింది. లావాదేవీలు మొదలైన మరుక్షణం నుంచే లాభాల్లో బాట పట్టిన పసిడి ధర, మార్కెట్ ముగిసే సమయానికి 200 రూపాయలు ఎగబాకి, 33,270 రూపాయలకు చేరింది. అదే విధంగా వెండి కూడా భారీ నష్టం నుంచి బయటపడి, 120 రూపాయలు లాభపడడంతో, ధర 39,100 రూపాయలకు చేరింది.