బిజినెస్

షిప్పింగ్ కార్పొరేషన్ సిఎండిగా అనూప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సిఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా అనూప్ కుమార్ శర్మ బాధ్యతలు చేపట్టారు. సోమవారం నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఎస్‌సిఐ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది. షిప్పింగ్ కార్పొరేషన్ మన దేశ ప్రధాన నౌకా రవాణా సంస్థగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత ప్రధాన నౌకా రవాణా సంస్థ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ దేశ సరకు రవాణాలో మూడింట ఒక వంతు నిర్వహిస్తోంది. నౌకా వ్యాపారంలో దాదాపు అన్ని రంగాలకు విస్తరించిన ఎస్‌సిఐ దేశ, విదేశీ వర్తకులకు ఎనలేని సేవలను అందిస్తోంది.