బిజినెస్
ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడితే రూ.కోటి జరిమానా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 December 2019
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల్లో సమాచారాన్ని పంచుకున్న వ్యవహారాల్లో అవినీతికి పాల్పడిన వారికి విధించే శిక్ష లు, లేదా జరిమానాలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సరికొత్త విధానాలను చేపట్టింది. ఈ సరికొత్త మార్గదర్శకాల మేరకు పంచుకున్న సమాచారానికి సంబంధించిన వనరుల వివరాలను వెల్లడించాలి. ఐతే సమాచారాన్ని అందజేసిన వ్యక్తి, లేదా సంస్థ వివరాలను గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. ఒక సెక్యూరిటీకి సంబంధించి ప్రచురితంకాని ధరతో సున్నిత సమాచారం (యూపీఎస్ఐ) పేరిట సెక్యూరిటీల నిర్వహించే వాణిజ్యాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటా రు. కాగా ఇలాంటి కేసుల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ చట్టం కింద కనీస మొత్తం కోటి రూపాయల వరకు జరిమానాగా వసూలు చేయడం జరుగుతుంది.