బిజినెస్

బంగారానికి మళ్లీ మెరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దీపావళి పండగ సీజన్‌తో పాటుగా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడంతో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆభరణాల తయారీదారులనుంచి డిమాండ్ పెరగడంతో గురువారం ఒక్కరోజే బంగారం ధర పది గ్రాములకు 250 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.36 శాతం పెరిగి 1259.40 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ బంగారం మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి పది గ్రాముల ధర రూ.30,400 ఉంది. బంగారం దారిలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగి కిలో రూ. 42,625కు చేరుకుంది.