బిజినెస్

ట్రావెల్‌యారి సరికొత్త ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ఆన్‌లైన్ బస్సు బుకింగ్ విధానంలో కొత్త ఒరవడి తీసుకువచ్చిన ట్రావెల్‌యారి సంస్థ.. ఆఫ్‌లైన్ పేమెంట్ ఏకీకరణ కోసం పేటిఎం, రిలయన్స్ జియోతో ఎంఓయు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులతో పాటు బస్సు ఆపరేటర్లకు కూడా పరిష్కారాలు చూపించేందుకు ఈ విధానం ఖరారు చేసినట్లు ట్రావెల్‌యారి అధికార ప్రతినిధి అరవింద్ లామ తెలిపారు. ఇంటర్ సిటీ ప్రయాణానికి సంబంధించి ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ కౌంటర్ల వద్ద నగదు రహిత చెల్లింపులను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తమకు పది వేల బ్రాంచిలు ఉన్నాయని, మొబైల్ వాలెట్, ఇతర క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా వినియోగదారులు టిక్కెట్లకు డబ్బును చెల్లించవచ్చునన్నారు. లావాదేవీలకు ఎలాంటి అదనపు రుసుము లేదని స్పష్టం చేశారు.