రాష్ట్రీయం

చరిత్ర తిరగరాశాం: కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ నేత, మంత్రి తారకరామారావుఅన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని, నిజమైన రాజకీయ నేతలుగా వ్యవహరించాలని విపక్షాలకు హితబోధ చేశారు. సిఎం కెసిఆర్ డైనమిక్ నాయకత్వాన్ని చూసిన నగర వాసులు ఈ భారీ మెజార్టీతో తీర్పు ఇచ్చారని అన్నారు. కుల, ప్రాంత, మతంతో సంబంధం లేకుండా నగర ప్రజలు అద్భుతమైన ఫలితాలను అందించారని కొనియాడారు. హైదరాబాద్ నగర చరిత్రలో ఈ తీర్పు నిలిచిపోతుందని అన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ మాత్రమే నగరాభివృద్ధి చేయగలరని విశ్వసించిన ప్రజలు టిఆర్‌ఎస్‌కు అద్భుత విజయాన్ని అందించారని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పటాపంచలు చేస్తూ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు. సిఎం కెసిఆర్ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని వెల్లడించారు.