గుంటూరు

కేంద్ర రాజధాని ప్రాంతంలో జపాన్ ప్రతినిధుల బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 27: రాజధాని ప్రాంతంలో జపాన్ గవర్నర్ సోమవారం పర్యటించనున్న ప్రదేశాలను ముందస్తుగా జపాన్ ప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. కేంద్ర రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంలో జపాన్ దేశానికి చెందిన తటికుమ ఇకో, సనోకి ఇకో, నీరుదాల్ లు పర్యటించారు. సిఆర్‌డిఎ ప్రత్యేక అధికారి చెన్నకేశవరావు, కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ గంధం చంద్రుడు జపాన్ ప్రతినిధులతో కలిసి ఉద్దండరాయునిపాలెంలో పర్యటించారు. గవర్నర్ పరిశీలించే ప్రదేశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారుల నుంచి ప్రతినిధులు సేకరించారు. రాజధాని ప్రాంతంలో గవర్నర్ వచ్చి వెళ్లేందుకు అయ్యే సమయం కూడా ప్రతినిధులు గుర్తించారు. మిగిలిన ఏఏ ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించాలనే విషయంపై కూడా అధికారుల ద్వారా ప్రతినిధులు వివరాలు సేకరించారు.