ఆంధ్రప్రదేశ్
తుని ఘటనపై సిబిఐ విచారణకు చిరంజీవి డిమాండ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 June 2016
హైదరాబాద్: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో నిజానిజాలను వెలికితీసేందుకు సిబిఐ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ, సినీనటుడు చిరంజీవి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఎపి సిఎం చంద్రబాబుకు శనివారం ఓ లేఖ పంపారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేసిన తీరు సమంజసంగా లేదని ఆయన తన లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ముద్రగడ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నారు. కాపుఉద్యమ నేతపై ప్రభుత్వం, పోలీసులు కక్ష సాధింపు ధోరణికి స్వస్తిపలకాలని చిరంజీవి పేర్కొన్నారు.